20-05-2025 11:51:40 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులా(Telangana Social Welfare Gurukula)ల్లో ఆరు నుండి తొమ్మిది తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు గురుకులాల సెక్రటరీ అలగు వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లో ఇందుకు ప్రవేశాలను కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 23న నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 28న విడుదల చేసిన విషయం తెలిసిందే.