30 June, 2026 | 10:49 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి

20-05-2025 11:02 PM

మరొకరికి తీవ్ర గాయాలు..

తలమడుగు (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(కే) గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై రాధిక(SI Radhika) తెలిపిన వివరాల ప్రకారం... కొలంగూడకి చెందిన సిడాం సురేష్(22) వ్యవసాయ పొలంకు ట్రాక్టర్ పై వెళ్తుండగా ప్రమాదవశత్తు ట్రాక్టర్ పైన పడడంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందారన్నారు. మరోవ్యక్తి ప్రణీత్ కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఐ పేర్కొన్నారు.