24 May, 2026 | 2:13 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

ప్రకాశం బ్యారేజీ వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ

19-08-2025 12:32 PM

హైదరాబాద్: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి ఐదు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని నదులు, జలాశయాలలో వరద నీటి ప్రవాహానికి దోహదం చేస్తున్నాయి. కృష్ణా నదిలో వరద నీరు పెరిగి.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు ఉప్పొంగుతోంది. ఐదు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు(బ్యారేజీ) చేరుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈరోజు సాయంత్రానికి ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ(APSDMA) సూచించింది. అలాగే బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేశారు. జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా, భారీ వర్షాల కారణంగా కాలువలు, వాగులు ఎక్కువగా ఉప్పొంగిపోతున్నందున వాటిని దాటవద్దని ప్రజలకు సూచించారు.