06-08-2025 02:07:39 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో మాజీ కౌన్సిలర్ గా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందిన తోడే వంశీకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం బుధవారం అమెరికాలో నివసిస్తున్న అతని సోదరుడు తోడే వెంకట కృష్ణారెడ్డి సహకారంతో గ్రామీణ బస్టాండ్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీక లక్ష్మణ్, లెంకల సన్నీ యాదవ్, పసులేటి వెంకటేష్, వెంకట్ యాదవ్, కేశ బోయిన రఘు, చందు పట్ల లింగమూర్తి, కనకయ్య లు పాల్గొన్నారు.