17-06-2025 01:08:43 AM
ఎంఎన్జే ఆసుపత్రి ఆవరణలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్-గెజిటె డ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో సోమవారం ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో సుమా రు వెయ్యిమంది పేద రోగుల సహాయకులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్, ఎం.సత్యనా రాయణ గౌడ్, ఉపాధ్యక్షులు టీ.పర్వతాలు హాజరయ్యారు.
హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్య క్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఖలీద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ముకీమ్ ఖురేషి, టీఎన్జీవో ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బి శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా ఏపీఆ ర్ఓ మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్ పాల్గొన్నారు.
మీడియాతో ముజీబ్ మాట్లా డుతూ.. కీర్తిశేషులైన తల్లిదండ్రుల పేరు మీద, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగుల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు.