24-08-2025 04:36:17 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కాసిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం ఆశ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా చారిటీ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశా చారిటీ నిర్వాహకురాలు గోగర్ల కేత, దాతలు దరోగ సింగ్, గంగిశెట్టి శ్యాం కుమార్, పలువురు యువకులు పాల్గొన్నారు.