01-08-2025 08:10:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని బొమ్మరిల్లు కాలనీలో వన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానికులు పలు రకాల మొక్కలను శుక్రవారం నాటారు. కాలనీ అధ్యక్షుడు పోచయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థి రిదాన్ సాయి, భూషణ్, రవీందర్ రెడ్డి, సంపత్ కుమారులు తదితరులు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 150 మొక్కలు నాటారు. కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే దిశగా ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.