4 July, 2026 | 10:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సిరి సిద్ధి వినాయక శోభాయాత్రలో మాజీ కార్పొరేటర్ శేషా కుమారి పాల్గొనడం విశేషం

05-09-2025 05:41 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): బాల్కంపేట్ లోని పరిసర ప్రాంతం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన సిరి సిద్ధి వినాయక శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు.శోభాయాత్ర విజయవంతం కావడానికి కమిటీ సభ్యులు కళ్యాణ్, మల్లికార్జున్, అరుణ్, కార్తీక్, సతీష్ విశేష కృషి చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మహిళా నాయకులు కూతురు నరసింహ, బలరాం, లక్ష్మి భాష, నాగలక్ష్మి, దుర్గా, రాణి కౌర్ పాల్గొని శోభాయాత్రకు మరింత భక్తి వైభవం జోడించారు.శోభాయాత్రలో వినాయక భజనలు, డప్పు వాయిద్యాలు, హారతి దృశ్యాలు భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపు మార్గమంతా భక్తులు గణనాథుడి నామస్మరణ చేస్తూ పూలతో, పండ్లతో స్వాగతం పలికారు.ఈ వేడుకను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కుటుంబ సభ్యులతో సహా స్థానికులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి ఆశీర్వాదాలతో ఇళ్లలో శాంతి, సంపదలు వెల్లివిరియాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శేషు కుమారి మాట్లాడుతూ... "గణనాథుడు విఘ్నాలను తొలగించి ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను. సిరి సిద్ధి వినాయక శోభాయాత్రలో పాల్గొనడం నాకు ఆనందాన్నిచ్చింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయి" అని అన్నారు.