15 June, 2026 | 1:59 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి అరెస్ట్

12-10-2025 03:17 AM

మణికొండ, అక్టోబర్ 11: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ వార్డు మాజీ కార్పొరేటర్ బూరుగు శ్రీనాథ్‌రెడ్డిని నార్సింగి పోలీసులు శనివారం అరెస్ట్ చేశా రు. ఓ ఇంటి యజమానిని బెదిరించి డబ్బు లు వసూలు చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదర్ షాకోట్ పరిధి లో ఓ వ్యక్తి 100 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టాడు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్న మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, యజమానిని బెదిరించడం మొదలుపెట్టాడు.

అక్రమ నిర్మాణం విషయాన్ని బయ టపెడతానని, అధికారులతో చెప్పి కూల్చివేయిస్తానని భయపెట్టాడు. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండాలంటే తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు, ముందుగా 5 లక్షల రూపాయలు చెల్లించాడు. అయినా శ్రీనాథ్‌రెడ్డి వేధింపులు ఆపలేదు. మిగిలిన రూ.5 లక్షలు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచాడు. బెదిరింపులు ఎక్కువవడంతో బాధితుడు నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.