12-10-2025 12:01:42 PM
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న "అన్ని స్థానాలకు" అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించవచ్చని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలోని 243 సీట్లలో 103 సీట్లలో జెడి(యు) పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని, అయితే ఎన్డీఎ సీనియర్ నాయకులు తగిన సమయంలో అధికారిక ప్రకటన చేస్తారని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ సీనియర్ నాయకుడు పేర్కొన్నారు.
జెడి(యు) పార్టీ తాము పోటీ చేసే స్థానాలను గుర్తించారని, ఆయా అభ్యర్థులను కూడా ఖరారు చేశారని తెలిపారు. పనితీరు బాగాలేని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొత్త అభ్యర్థులతో భర్తీ చేస్తుందన్నారు. గత వారం ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ఆర్జేడీలో చేరిన ఖగారియాలోని పర్బట్టా స్థానంలో కూడా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు వ్యాఖ్యానించారు. బహుళ పర్యాయాలు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బీమా భారతి ప్రతిపక్ష పార్టీల పక్షాన నిలిచిన రుపౌలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతుందని జెడి(యు) నాయకుడు స్పష్టం చేశారు.