12-10-2025 12:22:00 PM
హైదరాబాద్: కూకట్పల్లి పోలీసులు ఒక హాస్టల్పై దాడి చేసి జూదం ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి నుండి రూ.97,370 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కూకట్పల్లి పోలీసులు హాస్టల్పై దాడి చేసి లక్ష్మణ్ ప్రసాద్, బోగటి యోగేంద్ర, హిక్మత్ బహదూర్ బోగతి, భరత్ ప్రసాద్ ధమాల, పూర్ణప్రసాద్ జైసీ, అమర్ కున్వర్, నిర్పా బహదూర్ ఠాకుల్లాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.