24 June, 2026 | 12:32 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

మాదిగలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి

11-01-2026 01:06 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు విజ్ఞప్తి చేసిన మాజీమంత్రి మోత్కుపల్లి 

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): మాదిగలకు ప్రభుత్వం, పార్టీలో సముచిత భాగస్వామ్యం కల్పించేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ సీనియర్ నాయకులు ముంజగల్ల విజయ్ కుమార్ శనివారం కలిసి కోరారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, మాదిగ అమరవీరుల స్తూపాన్ని, మాదిగ భవన్‌ను హైదరాబాద్‌లో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో ఒక సమావేశం ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని మహేశ్ కుమార్‌గౌడ్‌ని మోత్కుపల్లి కోరారు.