calender_icon.png 28 August, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

28-08-2025 02:20:10 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను గురువారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే(Former MLA of Kamareddy) గంప గోవర్ధన్  పరిశీలించారు. పట్టణంలోని జి ఆర్ కాలనీ గల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని ఓదార్చారు ఇంటింటికి వెళ్లి వరద తీవ్రతను జరిగిన నష్టాన్ని బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. రామారెడ్డి రోడ్డులో గల టీచర్ కాలనీలో పర్యటించారు.

అక్కడ ఇంటింటికి వెళ్లి బాధితులతో వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కామారెడ్డి వాగు పొంగి వంశమైన రోడ్లను కాలనీలను పరిశీలించారు అక్కడి నుండి దేవునిపల్లి లో గల నిజాంసాగర్ రోడ్డులో దంసమైన రోడ్లను ముంపుకి గురైన ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  నాయకులు మాజీ  ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వెంట పార్టీ నాయకులు ,పట్టణ పార్టీ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి ,కుంభాల రవి, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్, స్వామి కృష్ణాజి రావు ,పాత హనుమాన్లు, ఫ్లోర్ లీడర్ ఆఫీస్ యువజన విభాగం అధ్యక్షుడు భాను తో పాటుపలూరు ఉన్నారు