calender_icon.png 25 August, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

25-08-2025 12:50:52 AM

బెల్లంపల్లి, ఆగస్టు 24 (విజయ క్రాంతి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా బద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో రూ కోటి టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు.

రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి రహదారిని ప్రజలకు సౌలభ్యంగా మార్చేందుకు వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు చిలుమల శంకర్, మునిమంద రమేష్, కన్నయ్య సింగ్, జక్కుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.