15 July, 2026 | 1:15 PM

Breaking News

డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •  

అడవి పంది మాంసంతో నలుగురు అరెస్టు

28-09-2025 05:24 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డి పల్లి గ్రామంలో అడవి పంది మాంసంతో నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు కాసిరెడ్డిపల్లి గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో అడవి పంది మాంసంతో గంధం రాజన్న, సిరిగిరి సాయి దొరికారు. వీరిని విచారించగా కన్నాల గ్రామానికి చెందిన ముస్కె శ్రీనివాస్ రెండు చనిపోయిన అడవి పందులను అప్పగించినట్లు చెప్పారు. ఈ విచారణలో ముస్కె శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నెల 27న సాయంత్రం జంగేపల్లి చంద్రమోగిలి పత్తి చేనులో కరెంటు వైర్లు అమర్చి రెండు అడవిపందులను చంపారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని, అడవిపంది మాంసా న్ని స్వాధీనం చేసుకొని నిందితులను రేంజ్ ఆఫీస్ కి తరలించారు. ఈ దాడి లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జై తిరుపతి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గౌరీ శంకర్, గోపికృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోపికృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి రాజు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిహెచ్ భాస్కర్ పాల్గొన్నారు.