26-05-2025 12:15:21 PM
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలో( East Godavari district) సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంతమూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలిపైపున కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు(Kontamuru) వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.