10 April, 2026 | 3:29 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

నాలుగో టీ20 రద్దు

17-12-2025 09:48 PM

లక్నో: లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈరోజు జరగాల్సిన భారత్(India), దక్షిణాఫ్రికా(South Africa) జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా రద్దయింది. ఎకానా స్టేడియాన్ని పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో అంపైర్లు మొదటి పరిశీలనను సాయంత్రం 06:50 గంటలకు పరిశీలించారు. 07:30, 08:00, 08:30, 09:00 గంటలకు పొగమంచు పరిస్థితిని మరోసారి పరిశీలించారు. కానీ పరిస్థితులు మ్యాచ్‌కు అనుకూలంగా లేవని భావించారు. మ్యాచ్ జరగడం కష్టమని భావించి తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా, ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఎల్లుండి ఐదో టీ20 అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.