17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు

17-12-2025 11:05 PM

హైదరాబాద్: జగిత్యాల జిల్లా(Jagtial Districtవెల్గటూర్ మండలం పైడిపల్లి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఫలితం ప్రకటన అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పైడిపల్లి సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని పట్టుబడ్డారు. కాగా, గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి, అనుచరులు ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఇరువర్గాలు గొడవకు దిగడంతో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘర్షణను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.