24-09-2025 06:53:54 PM
నకిరేకల్,(విజయక్రాంతి): సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సహకారంతో బుధవారం పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 72 మంది పేషెంట్లకు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 20 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారిని హైదరాబాద్ కు తరలించారు.