06-07-2025 10:30:46 PM
మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ పంచాయతీ వద్ద శ్రీ ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(Sri Pramila Multispeciality Hospital) డాక్టర్ సతీష్ కుమార్ యాదవ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోయ సురేష్, గ్రామ ప్రజలు ఉన్నారు.