13-05-2025 08:55:25 PM
స్వరాజ్యం కమిటీకి కుట్టు మిషన్ అందజేత...
కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో 30 రోజులపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఎస్.బి.ఐ. బ్యాంకు సహకారంతో మహిళలకు నిర్వహిస్తున్నారు. 12 వేల రూపాయల మిషిన్ ను గ్రామ స్వరాజ్య సంస్థకు అందజేసారు. ఒకో నిరుద్యోగ యువతికి 6200/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. గ్రామంలోని 35 మంది నిరుద్యోగ యువతులకు గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య ధృవపత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మండల కోఆర్డినేటర్ ఆర్. భానుప్రియ, ఐకెపి సిసి ఆంజనేయులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు భిక్కనూర్ లింగవ్వ, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్. సంతోష్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ జె.నాగరాజ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కూడలి సాయిలు, మిల్క్ సెంటర్ చైర్మన్ పి. ప్రతాపరెడ్డి, కారోబార్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.