07-06-2025 12:00:00 AM
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా తదితరులు కీలక పాత్రధారులుగా ఓ సినిమా రూపొందుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ ఈ చిత్రాన్ని తెరకె క్కిస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కల్యాణ్ మంతిన, భానుప్రతాప, డాక్టర్ విజయేందర్రెడ్డి తీగల నిర్మాతలు. సప్త అశ్వ మీడి యా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మిత్ర మండలి’ అనే టైటిల్ను ఖారారు చేశారు మేకర్స్.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం వెల్లడించింది. టైటిల్తోపాటు, ఫస్ట్లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన ఆమె ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్క్రూజ్తో కలిసి పనిచేసింది.
స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధృవన్; ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్జే; కూర్పు: పీకే; కళా దర్శకత్వం: గాంధీ నడికుడికర్.