15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

హెల్త్ కేర్ రంగంలోకి ఫ్యూజీఫిల్మ్ ఇండియా

30-01-2026 05:30 PM

హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ మరియు డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, 'ఆయుష్మాన్ భారత్' వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది.

ఈ మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగంలో అగ్రగామి అయిన ఫ్యూజీఫిల్మ్ ఇండియా. హైదరాబాద్‌లో జరుగుతున్న 'ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్'  సదస్సులో నాలుగు అత్యాధునిక ఇమేజింగ్ మరియు హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాలను ఆవిష్కరించింది. ఎలాంటి ఆసుపత్రి వాతావరణంలోనైనా కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, వేగవంతమైన పనితీరు, సేవలను విస్తృతం చేసే సాంకేతికతల ద్వారా... భారతదేశ డయాగ్నోస్టిక్ రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పాన్ని కంపెనీ చాటిచెప్పింది.

ఈ ఆవిష్కరణలలో ప్రధానమైనది 'ఎఫ్‌సిటి ఐస్ట్రీమ్' ఇది "తక్కువలో ఎక్కువ" అనే డిజైన్ సూత్రంతో రూపొందించిన ఫ్యూజీఫిల్మ్ వారి సరికొత్త సిటి స్కాన్ వ్యవస్థ. ఎఫ్‌సిటి ఐస్ట్రీమ్... హై-డెఫినిషన్ ఇమేజింగ్‌ను, తక్కువ రేడియేషన్ డోస్‌ను మరియు 'సినర్జీ-డ్రైవ్' , రిలీ అనే మెడికల్ ఏఐ టెక్నాలజీలతో కూడిన ఆటోమేషన్‌ను మిళితం చేస్తుంది. రోగిని స్కానర్ పై పడుకోబెట్టడం దగ్గరి నుంచి స్కాన్ ప్లానింగ్, ఇమేజ్ రీకన్‌స్ట్రక్షన్ వరకు... స్కానింగ్ ప్రక్రియలోని కీలక దశలన్నింటినీ ఇది ఆటోమేట్ చేస్తుంది. ఇది 'సినాప్స్ 3డి వర్క్‌స్టేషన్'తో అనుసంధానించబడి, శరీరాంతర్గత భాగాలను స్పష్టంగా చూపిస్తుంది.

దీనివల్ల రేడియాలజీ విభాగాలు పెరుగుతున్న రోగుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాయి. ఇందులోని అధునాతన టెక్నాలజీలు... గుండె, మెదడు, క్యాన్సర్, ప్రమాదాలు మరియు నివారణ ఆరోగ్య పరీక్షల్లో అతి తక్కువ రేడియేషన్‌తోనే కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి. సిటి స్కాన్లతో పాటు, ఫ్యూజీఫిల్మ్ ఇండియా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 'అమ్యూలెట్ సోఫినిటీ'  అనే అధునాతన డిజిటల్ మామోగ్రఫీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.