06-06-2025 01:05:52 AM
డీఆర్ఓ పద్మజారాణి సంగారెడ్డిలో అవగాహన ర్యాలీ
సంగారెడ్డి, మే 5(విజయ క్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పర్యావరణ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో డిఆర్ఓ పాల్గొని ప్రసంగిస్తూ ఈ సంవత్సరం థీమ్ అయినటువంటి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ పట్ల అందరికీ అవగాహన అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా విరివిగా ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలని, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయలైనటువంటి స్టీలు, జ్యూట్ బ్యాగులు, బట్ట సంచులను వాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గీత, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట నాగేంద్ర చక్ర ప్లాస్టిక్ ఇండస్ట్రీ కి సంబంధించిన సతీష్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్కల్ ఉపాధ్యాయుడు రామకృష్ణ,ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ కొంకా రాజేశ్వర్ లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని డిఆర్ఓ ప్రతిజ్ఞ చేయించారు.
ఆన్లైన్ వేదికగా నిర్వహించిన పెయింటింగ్, వ్యాసరచన పోటీలకు సంబంధించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, ఎన్జిసి జిల్లా సమన్వయ కర్త మాధవ రెడ్డి, వివిధ పరిశ్రమల నుండి వచ్చిన ఉద్యోగులు, పీసిబి సిబ్బంది పాల్గొన్నారు.