29 August, 2026 | 12:41 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •  

కాళేశ్వరం నుండి పలుగుల గ్రామానికి డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు: మంత్రి శ్రీధర్ బాబు

12-09-2025 06:05 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం నుండి పలుగుల గ్రామానికి  7 కిలోమీటర్లు డబల్ రోడ్డు నిర్మాణానికి రూ. 22 కోట్ల నిధులు రోడ్లు భవనాల శాఖ మంజూరు చేసినట్లు శుక్రవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కాళేశ్వరం పలుగుల డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబుల్ రోడ్డు నిర్మించడం వల్ల పలుగుల, కుంట్లం, కాళేశ్వరం,మద్దులపల్లి గ్రామాల్లోని ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.