31 May, 2026 | 8:31 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

గాలి జనార్దన్‌రెడ్డి మోడల్ హౌస్ దహనం

25-01-2026 12:03 AM
  1. బళ్లారిలో ఘటన.. రంగంలోకి పోలీసులు
  2. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

బెంగళూరు, జనవరి ౨౪: కర్ణాటకలోని బళ్లారిలో ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డికి చెంది న రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్‌కు శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. మంటల ను గమనించిన స్థానికులు హుటాహుటిన భవనం వద్దకు వచ్చారు. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నిందితులు వారి నుంచి తప్పించుకుని పరారయ్యారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలా నికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జనార్దన్‌రెడ్డి పదేళ్ల క్రితం ఈ భవనం నిర్మించగా, ప్రస్తుతం అక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు. దీంతో ప్రాణనష్టమేమీ నమోదు కాలేదు. ఈ ఘటనపై గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మద్దతుదారులే భవనానికి నిప్పుపెట్టారని పేర్కొన్నారు. ఈనెల 1న ఎమ్మెల్యే బృందం తమను బెదిరించారని, దీనిలో భాగంగానే తాజాగా తమ ఆస్తులకు నిప్పు పెట్టారని వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇదే రోజు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువకులు కాగా, ఆరుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. తాము నిర్మానుష ప్రాంతలంలో రీల్స్ చేసేందుకు నిప్పు వెలిగించగా, అది కాస్త భవనానికి అంటుకు న్నాయని పోలీసులకు నిందితులు వాంగ్మూ లం ఇచ్చినట్లు తెలిసింది.