31 May, 2026 | 7:37 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఇరాన్ దిశగా ‘అబ్రహాం లింకన్’

25-01-2026 12:01 AM
  1. ఆ.. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో యుద్ధవిమానాలు, క్షిపణులు

తీవ్రంగా స్పందించిన ఇరాన్ ప్రభుత్వం

వాషింగ్టన్/ టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఆదేశాల మేరకు ‘ఆర్మడా’ నావికాదళం ఇరాన్ దిశగా దూసుకువెళ్తున్నది. ‘అబ్రహం లింకన్’ అనే ఎయిర్‌క్యారియర్‌లో యుద్ధవిమానాలు, క్షిపణులతో హిందూ సముద్ర జలాల్లో ముందుకు సాగుతున్నది. వాయు వ్య దిశగా పరుగులు పెడుతూ అరేబియన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించనున్నది. ఈ పరిణామంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమపై జరిగే ఎలాంటి దాడినైనా, తాము సంపూర్ణ యుద్ధంగానే పరిగ ణిస్తామని హెచ్చరించింది.

తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, సర్వ శక్తులను ఉపయోగిస్తామని ప్రకటించింది. దాడులు పరిమితంగా ఉన్నా లేదా సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఉన్నా ఫలితం మాత్రం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో తన సైన్యాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సైనికులు ఎప్పుడు యుద్ధం మొదలైనా ఎదురుదాడి చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు.