31 May, 2026 | 9:29 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఉత్తరాదిలో హిమపాతం

25-01-2026 12:05 AM

కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటకుల సందడి

శ్రీనగర్/ సిమ్లా: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం కురుస్తున్నది. సిమ్లా, మనాలి, గుల్మార్గ్, సోనామార్గ్, డల్హౌ సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. కశ్మీర్ లోయ లోని షోపియాన్, లోలాబ్ ప్రాంతాల్లో కురిసిన హిమపాతం కారణంగా ఏకంగా నాలు గు అడుగుల మేర మంచు పేరుకుంది.

హి మపాతం కారణంగా పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హిమపాతం రవాణా వ్యవస్థను పూర్తిగా స్తం భింపజేసింది. శ్రీనగర్ -జమ్మూ జాతీ య రహదారిపై మంచు పేరుకుపోవడంతో అక్క డి ప్రభుత్వం రాకపోకలు నిలిపివేసింది. మ రోవైపు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి కొ న్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.