17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సంగారెడ్డి జిల్లాలో దొంగల ముఠా అరెస్టు

15-05-2025 02:22 AM
  1. 29 తులాల బంగారం, 47 తులాల వెండి, 4 లక్షల నగదు స్వాధీనం
  2. సంగారెడ్డి డీఎస్పీ సత్త్యయ్య గౌడ్

సంగారెడ్డి, మే 14(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న దొంగల ముఠాను పట్టుకుని అరె స్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తం గా పగలు, రాత్రి దొంగతనాలు నివారించాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వరం లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ము మ్మర తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

అందులో భాగంగా బుదవారం ఉదయం సంగారెడ్డి బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఎపి23 టీఏ 0092 నంబరు గల ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు విచారించే క్రమంలో వారు పారిపోతుంటే పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో రాజంపేటకు చెందిన మార్ల యాదగిరి, మార్ల అనిత, ముస్లాపూర్ గ్రామానికి చెందిన తలారి లక్ష్మి తో పాలు ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు తెలిపారు.

ఇలావుండగా ఒకే కుటుంబానికి చెం దిన నిందితులు జల్సాలకు అలవాటు పడి, తప్పుడు మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలని పగలు రెక్కి నిర్వహించి, తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని, రాత్రి దొంగతనాలకు పాల్పడుతూ నలుగురు నిందితులు కలి సి జిల్లాలో హత్నూర, సంగారెడ్డి టౌన్, సం గారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. 

గతంలో సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలైన వికారాబాద్, మోమిన్ పేట్, సైబరాబాద్, నర్సాపూర్ లలో నిందితుడు మార్ల యాదగిరి 35 దొంగతనాలు, మార్ల యాదగిరి, మైనర్ నేరస్తుడు కలిసి 12 దొంగతనాలు మొత్తం 53 దొంగతనాలు చేసినట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.

నిందితుల వద్ద నుండి 29 తులాల బంగారం, 47 తులాల వెండి, రూ.4 లక్షల నగదు,, ఒక బైక్ స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసు చేధనలో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి రూరల్ సి.ఐ క్రాంతి కుమార్, ఎస్.ఐ రవీందర్, క్రైమ్ సిబ్బంది షాకిర్,  నాగరాజు, రాజు, నర్సింలును డీఎస్పీ అభినందించారు.