30-05-2025 12:50:46 AM
ఇద్దరు నిందితుల అరెస్టు
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
రాచకొండ సీపీ సుధీర్ బాబు
ఎల్బీనగర్, మే 29 : రాచకొండ పోలీసు లు సంయుక్తంగా దాడులు నిర్వహించి, మూడు కేసులను ఛేదించి, నిందితులను అ రెస్టు చేశారు. ఆయుధాలు విక్రయిస్తున్న ముఠాతో పాటు, కరుడుగట్టిన దొంగను, భూమిని విక్రయిస్తామని చెప్పి, అడ్వాన్స్ గా ఇచ్చిన నగదును చోరీ చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. గురువారం ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు ప్రత్యేక సమా వేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీ సులు ఛేదించి కేసుల వివరాలను వెల్లడించారు.బాలాపూర్ పోలీసులు, మహేశ్వరం ఎస్వోటీ బృందంతో కలిసి అంతర్రాష్ట్ర ము ఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దేశ త యారీ ఆయుధాలను (తపంచాలు), బుల్లె ట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. వివరాల్లోకి వెళితే.... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ నగర్ జిల్లా, జీనా ఇనాయత్ ఖాన్ కాలనీలో నివసిస్తున్న మహమ్మద్ జీషాన్, మహమ్మద్ అ మీర్ అనే ఇద్దరు హైదరాబాద్ లోని సంతో ష్ నగర్లో నివసిస్తున్నారు. మహమ్మద్ జీషాన్ అలియాస్ జీఖాన్(28) సంతోష్ నగ ర్ లో హెయిర్ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నా డు. తనకు సహాయంగా ఉండడానికి, మహమ్మద్ అమీర్ అలియాస్ రాజా( 24)ను ని యమించుకున్నాడు.
మహమ్మద్ జీషాన్ మద్యం, విలాసవంతమైన జీవనశైలి ఇతర చెడు అలవాట్లకు బానిసయ్యాడు. సులభం గా డబ్బు సంపాదించడానికి, తక్కువ ధరలకు దేశీయంగా తయారు చేసిన ఆయుధా లను కొనుగోలు చేసి, హైదరాబాద్ నగరం లో అధిక ధరలకు విక్రయించాలని పథకం వేశాడు. అదే విషయాన్ని అమీర్కు చెప్పాడు. ఈ క్రమంలో జీషాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలో నివసిస్తున్న తన స్నేహితుడు అర్షి ఖాన్ను సంప్రదించాడు.
ఇతడికి అక్రమ తుపాకీ తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. వారి ప్రణాళిక ప్రకారం, కొన్ని రోజుల క్రితం వారు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నగరం నుండి 5 వివి ధ రకాల తపంచాలను సేకరించి, హైదరాబాద్ కు తరలించాడు. కాగా, 29వ తేదీన ఉదయం 9 గంటలకు జీషన్, అమీర్ బాలాపూర్ ఉన్న సెలూన్ దుకాణంలో తుపాకీల ను ఉంచడానికి వెళ్తున్నారు.
విశ్వసనీయ స మాచారంతో బాలాపూర్ పోలీసులు, మహేశ్వరం ఎస్వోటీ బృందం బాలాపూర్ పరిధి లోని రాయల్ కాలనీ వద్ద నిందితులను అ డ్డుకుని 5 కంట్రీ మేడ్ తపంచాస్ తుపాకు లు, 18 లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు.
పహాడిషరీప్లో కరుడుగట్టిన దొంగ అరెస్టు
పహాడిషరీఫ్ తోపాటు వివిధ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇండ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అల్లం శివని అరెస్టు చేశారు. ఇతడిపై గతంలో ఏడు కేసు లు నమోదయ్యాయి. ఇతడి నుంచి 13 తు లాల బంగారు ఆభరణాలు, 41 తులాల వెం డి ఆభరణాలు, రూ, 50వేల నగదు, 1 కెటిఎమ్, 1 రాయల్ ఎన్ఫీల్ మోట్సాకిళ్లను స్వా ధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... అల్లం శివ... గాజులపేట గ్రామం మహబూబ్ న గర్ నుంచి హైదరాబాద్ లోని అంబర్ పేట బతుకమ్మ కుంటకు వచ్చాడు. అతను గంజా యి, మద్యం, సిగరెట్లు, ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడు. విలాసవంతమైన అవసరా ల కోసం క్రమం తప్పకుండా నేరాలు చేస్తున్నాడు. పాత కేసుల్లో అక్టోబర్-2024 నెలలో జైలు నుండి విడుదలయ్యాడు. తన విలాసాలకు తగినంత డబ్బు లేకపోవడం ఇండ్ల లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
పహాడిషరీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితుడు పట్టుబడ్డాడు. 29న ఉద యం 6 గంటలకు హైదరాబాద్లోని శాలిబండ వద్ద నిందితుడు దొంగిలించబడిన సొ త్తును విక్రయించడానికి వెళుతుండగా పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్ స్పెక్టర్ నేతృత్వంలోని క్రైమ్ బృందం పట్టుకుని, అరెస్టు చేశారు.
భూమి విక్రయిస్తామని మోసం.29 లక్షలు చోరీ చేసిన నలుగురు అరెస్టు
బాలాపూర్ పోలీసులు నలుగురు నేరస్తులను అరెస్టు చేసి, రూ. 28.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సయ్యద్ అబ్దుల్ ఖాదర్(34) ఎర్రకుంటలో ఉంటున్నాడు. హబీద్ హరూన్ ( 41) జమాల్ బండాలోని ముం తాజ్ బాగ్ లో ఉంటున్నాడు. వర్ధన్ రవి (34) చాంద్రాయణగుట్ట లోని కుమ్మరి వాడి లో ఉంటున్నాడు. రషీద్ ఖాన్ పరారీ లో ఉన్నాడు. రసికాంత్ బర్ధన్ (31) హౌ సింగ్ బోర్డు కాలనీ, లక్ష్మీగూడ రిలేషన్ లో ఉంటున్నాడు.
ఇలియాస్( 25) సంతోష్ నగర్ లో ఉంటున్నాడు. మహమ్మద్ జకీర్ (58) తన అల్లుడు శ్రీ కబీర్ కు తన బంధు వు ఒబేద్ ద్వారా ప్లాట్ కొనుగోలు కోసం రూ. 29 లక్షల నగదును అందజేశాడు. శ్రీ కబీర్ హైదరాబాద్లో అందుబాటులో లేనందున ఇచ్చిన డబ్బును ఇలియాస్ స్నేహితు డు ఎర్రకుంట ఖాదర్ ఆలీకి అప్పగించమని కోరాడు. ఖాదర్ తీసుకున్న డబ్బును దోచుకోవడానికి వర్ధన్, కిట్టు, హబీబ్ హరూన్ పథకం పన్నాడు.
డబ్బును దోచుకోవడానికి రషీద్, రసికాంత్ బర్దన్ అలియాస్ కిట్టును సంప్రదించాడు. వారి పథకం రూ. 29 లక్షల నగదును ఎర్రకుంటలోని టోటల్ గ్యాస్ వద్ద దొచుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నగదు చోరీ చేసిన నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ, 28.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
మూడు కేసుల్లో నిందితులను సీపీ సుధీ ర్ బాబు పర్యవేక్షణలో మహేశ్వరం జోన్ డీసీపీ సునీత రెడ్డి, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జనాకీరెడ్డి, సీఐ గురువా రెడ్డి, SHO పహాడిషరీఫ్ PS మరియు CH. జితేందర్ రెడ్డి, డిటెక్టివ్ బృందం పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు.