30-05-2025 12:49:49 AM
-కొనుగోలు చేసిన ధాన్యం కల్లాలలోనే
-పదిహేను రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించని వైనం
-ఆందోళన చెందుతున్న రైతులు ధాన్యం లారీలు
-ఇటు ధాన్యం కొనుగోలుదారులు ఆటు రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం
- నష్టపోతున్న రైతులు
-కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతుల. దైన్య పరిస్థితి
కామారెడ్డి, మే 29 (విజయ క్రాంతి), ధాన్యం అమ్మే రైతుల పరిస్థితి దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందేందుకు ఆశపడిన రైతులు కామా రెడ్డి జిల్లాలో ధైన్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకుందామనే సమయంలో ధాన్యం కొనుగోలు నిర్వాహకులు రైస్ మిల్లు యజమానులు తోపాటు అధికారులు కుమ్మక్కై రైతులను అవస్థలకు గురి చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం 15 రోజులైనా ధాన్యం రైస్ మిల్లులకు తరలించడం లేదు.
ఒకవైపు వర్షాలు పడు తుండగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షాలకు తడిసి మొలకలు ఎత్తుతున్నాయి. తడిసినధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని జిల్లా అధికారులు రైతులకు భరోసా కల్పించిన ఆచరణలో మాత్రం ఆచరించడం లేదు. ఆరబెట్టి మెచ్యూర్ 17% శాతం వస్తేనే కొనుగోలు చేసి ప్రభుత్వం మద్దతు అందిస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఖరాఖండిగా చెబుతున్నారు.
రైతులు అధికారులకు చెప్పిన పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు దాన్యం కొనుగోలు కేంద్రంలో తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం 15 రోజులు గడుస్తున్న రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలు పోసి రోజులు గడుస్తున్న కాంటాలు కావడం లేదు.
కాంటాలు అయిన ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు తరలించడం లేదు. అకాల వర్షాలు రావడంతో ధాన్యం తడిసి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. స్థానిక పరిస్థితులకు ప్రభుత్వం అధికారులు చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులు మరోవైపు అధికారులు చెపుతున్న రైతులకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు.
446 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు సగానికి పైగా కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాంటా చేయడం లేదని, కాంటాక్ట్ చేసిన ధాన్యం సైతం రైస్ మిల్లులకు తరలించకపోవడంతో వర్షానికి ధాన్యం తడుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు లారీలు సక్రమంగా రాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఔటాన్ రావడం లేదంటూ రైస్ మిల్లర్ల ధాన్యం కటింగ్
కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు రైస్ మిల్లర్లు ధాన్యం అవుతాను రావడం లేదంటూ కొర్రీలు పెడుతూ లారీకి 15 క్వింటాళ్ల వరకు కటింగ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కొనుగోలు కేంద్రంలో కటింగ్ మరోవైపు రైస్ మిల్ వద్ద కటింగ్ చేస్తూ రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లారీకి 8 నుంచి 20 బస్సుల వరకు ధాన్యాన్ని కటింగ్ చేస్తూ రైతుల నిలువు దోపిడికి గురి చేస్తున్నారు.
అకాల వర్షాలు పడుతుండడంతో తడిసిన ధాన్యం ముగిపోయి మొలకలు వస్తూ నాయంటూ రైస్మిల్లాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ధాన్యాన్ని రైస్ మిల్లు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఎలాంటి షరతులు పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆచరణలో మాత్రం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైస్ మిల్లర్ యజమానులు పాటించడం లేదు.
రైతుల ధాన్యాన్ని కటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాల్లో మార్చూరు రాలేదని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తరువు పేరిట బస్తాకు ఐదు కిలో నుంచి పది కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా రైస్ మిల్ యజమానులు సైతం లారీ లోడ్ నుంచి తరుగు పేరుతో కోత విధిస్తే చర్యలు తీసుకుంటాం. రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
విక్టర్, అదనపు రెవిన్యూ కలెక్టర్, కామారెడ్డి