07-09-2025 10:17:20 AM
హైదరాబాద్: టస్కర్ వాహనం ఢీకొని విధుల్లో ఉన్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు(GHMC sanitation worker) మృతి చెందింది. మృతురాలిని గుడిమల్కాపూర్ కు చెందిన రేణుకగా గుర్తించారు. బషీర్ బాగ్ వద్ద రోడ్డు(Road Accident) దాటుతుండగా రేణుకను టస్కర్ ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టస్కర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. టస్కర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి పారిశుద్ధ్య కార్మికురాలు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.