17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నిరుపేదలకు గౌసుద్దీన్ ఆర్థిక సాయం

23-05-2025 04:15 PM

మృతుల కుటుంబాలకు గౌసుద్దీన్ చేయుత..

వైరా, (విజయక్రాంతి): కారేపల్లి గ్రామానికి చెందిన గుర్రం వీరస్వామి  కుటుంబానికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ 50కేజీల బియ్యంతో పాటు 5వేల రూపాయలను ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఆపద అనే పదం చెవిలో పడేలోపే, నేను ఉన్నాను అని తనవంతు సహాయం చేయడానికి ముందు ఉండే మనిషీ  షేక్ గౌస్ ద్దీన్.   ఆపదలో ఉన్నారని తెలిస్తే, తన సొంత నిధులతో క్షణం కూడా ఆలోచన చేయకుండా తనవంతుగా, ఏదో రూపంలో సహాయం చేయడానికి వెనుకాడని  వ్యక్తి  గౌసుద్దీన్ అని పలువురు ఆయన సేవ గుణాన్ని కొనియాడారు. 

ఈ సందర్భంగా గౌసుద్దీన్ మాట్లాడుతూ...  కారేపల్లి పాత మాల బజార్ చెందిన గుర్రం  వీరస్వామి మరణ వార్త చాలా బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని అయన అన్నారు. ఆపదలో ఉన్నావారు ఏ గ్రామాలలో ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గౌస్ దీన్ పేర్కొన్నారు. పేదవారి కుటుంబాలలో తన  వంతు ఆర్థిక సాయం చేయడానికి నేను ఎల్లప్పుడు ముందు ఉంటానని  పేర్కొన్నారు. కారేపల్లి గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పింఛారు. ఈ కార్యక్రమంలో  డొంకెన రవీందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమాలు నాయకు  జుంకీలాల ,ఎండి. కలియుల్లా ఖాన్, రామకృష్ణ, సురేష్ రాకేష్, గుర్రం సుబ్బయ్య, పాస్టర్ తదితరులు పాల్గొన్నారు