calender_icon.png 27 January, 2026 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా మెడకు చుట్టుకుని బాలిక మృతి

27-01-2026 02:07:18 AM

తండ్రితో బైక్‌పై వెళ్తుండగా 

కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో ఘటన 

మేడ్చల్, జనవరి 26 (విజయక్రాంతి): తండ్రితో బైక్ పై వెళుతుండగా చైనా మాంజ మెడకు చుట్టుకుని ఐదేళ్ల బాలిక మృతి చెం దిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా కాజిపల్లి నుంచి తండ్రి ఇద్దరు కుమార్తెలతో బైక్ మీద కూకట్‌పల్లి వైపు వస్తుండగా వివేకానంద నగర్ వద్ద రహదారిపై నిశ్విక ఆదిత్య (5) మెడకు చైనా మంది చుట్టుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.