12 May, 2026 | 10:54 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

ఆ భూములను మా కిప్పించండి

21-09-2025 12:36 AM
  1. మంత్రి సీతక్కకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రైతుల వినతి
  2. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : 1988లో రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం హనుమాన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో 27 మంది రైతుల కు 54 ఎకరాల భూమిని అప్పటి ప్రభు త్వం కేటాయించిందని, ధరణి వల్ల ఆ భూములపై తమ పట్టాలు కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన వెలిబు చ్చారు. శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యను వివరించారు.

30 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములపై తమ కు పట్టాలు ఇప్పించాలని మంత్రి సీతక్కకు సదరు చెంచు రైతులు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. భూ పంపిణీలో భాగంగా గత ప్రభుత్వాలు పేద చెంచు రైతులకు పంచిన భూములపై పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు.