17 June, 2026 | 8:45 PM

Breaking News

బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •  

ఎల్లికల్‌లో భారీ చోరీ

04-11-2025 02:07 PM

లక్షల విలువైన మేకలు మాయం

కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు కుటుంబాలకు చెందిన పశువుల పాకలే లక్ష్యంగా చేసుకొని, సుమారు 28 మేకలను ఎత్తుకెళ్లారు.  గ్రామానికి చెందిన వసంత సత్యనారాయణకు చెందిన 26, అదే గ్రామానికి చెందిన బాతుక నర్సింహులుకు చెందిన రెండు మేకపోతులను దొంగలు ఎత్తుకెళ్లారు. రోజూలాగే మంగళవారం ఉదయం తమ జీవాలను చూసుకునేందుకు పశువుల పాకను చుసిన బాధితులు షాక్ కి గురయ్యారు. తమ జీవనాధారమైన మేకలు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.