15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎల్లికల్‌లో భారీ చోరీ

04-11-2025 02:07 PM

లక్షల విలువైన మేకలు మాయం

కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు కుటుంబాలకు చెందిన పశువుల పాకలే లక్ష్యంగా చేసుకొని, సుమారు 28 మేకలను ఎత్తుకెళ్లారు.  గ్రామానికి చెందిన వసంత సత్యనారాయణకు చెందిన 26, అదే గ్రామానికి చెందిన బాతుక నర్సింహులుకు చెందిన రెండు మేకపోతులను దొంగలు ఎత్తుకెళ్లారు. రోజూలాగే మంగళవారం ఉదయం తమ జీవాలను చూసుకునేందుకు పశువుల పాకను చుసిన బాధితులు షాక్ కి గురయ్యారు. తమ జీవనాధారమైన మేకలు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.