15 June, 2026 | 8:15 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి

04-11-2025 06:38 PM

కాటారం (విజయక్రాంతి): పశువులకు తప్పనిసరిగా గాలికుంటు టీకాలు వేయించాలని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపాల కృష్ణమూర్తి పాడి రైతులకు సూచించారు. కాటారం మండలం దేవరాంపల్లి, రేగుల గూడెం గ్రామాలలో పశు వైద్యాధికారులు డాక్టర్ ధీరజ్, రమేష్ లతో కలిసి సుమారు 125 గేదెలకు, 74 గోజాతి పశువులకు టీకాలు వేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాడి రైతులు తప్పనిసరిగా తమ పాడి పశువులకు ప్రభుత్వం ద్వార ఉచితంగా అందించే గాలికుంట టీకాలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.