15 June, 2026 | 11:47 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గంగారంలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

04-11-2025 06:52 PM

కాటారం (విజయక్రాంతి): విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చల్ల దేవేందర్ రెడ్డి(36) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఇంటి ఆవరణలో విద్యుత్ మోటర్ రిపేరింగ్ చేస్తుండగా విద్యుఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటనను గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దేవేందర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దేవేందర్ మృతితో గంగారం గ్రామంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన ఏకైక కొడుకు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నీరుగా విలపించారు.