15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చేవెళ్ల బస్సు ప్రమాదం.. హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు

04-11-2025 06:25 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో మిర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు-టిప్పర్ ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. డిసెంబర్‌ 15 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ రవాణా, హోం, మైన్స్ & జియాలజీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వంటి కీలక విభాగాలనుం ఆదేశించింది.

కమిషన్ పునరావృతమయ్యే ప్రమాదాలు, రోడ్డు భద్రతలో తీవ్ర నిర్లక్ష్యం, అమలు వైఫల్యాలు, మౌలిక సదుపాయాల జాప్యాలు ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. సంబంధిత అధికారులు నవంబర్ 15న ఉదయం 11 గంటలకు వాస్తవ, చర్య తీసుకున్న నివేదికలను సమర్పించాలని రవాణా శాఖ, హోంశాఖ భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కంకరతో వెళ్తున్న టిప్పర్ టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) బస్సును ఢీకొనడంతో టిప్పర్ లోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడింది. దీంతో టిప్పర్, బస్సు డైవర్లతో సహా 19 మంది మరణించారు. మృతుల్లో 10 నెలల శిశువు, తల్లి కూడా ఉందన్నారు.