20 May, 2026 | 3:54 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

రూ. లక్షా 30 వేలు దాటిన పసిడి ధర

14-10-2025 10:59 AM

హైదరాాబాద్: నగరంలో బంగారం ధరలు(Gold price hike) మరోసారి భారీగా పెరిగాయి. బంగారం రోజురోజుకు సామాన్యుడికి అందకుండా పోతుంది. నేడు బంగారం ధర రూ. లక్షా 30 వేలు దాటింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,850 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,780 చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,85,763కి పెరిగింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. అటు విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,680కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,950కి పెరిగింది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,06,000 చేరుకుంది.