28-06-2025 12:01:49 AM
*రూపురేఖలు మారుస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 27 (విజయ క్రాంతి) : నియోజకవర్గంలోని నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగు నీరు, విద్యుత్ మరియు మౌలిక సదుపాయాలు కల్పించేందుకురూ 73 లక్షల 10 వేల నిధులను ప్రభుత్వం మంజూరు చేసి నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అ న్నారు.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు రూ 22 లక్షల 5వేలు, ప్రభుత్వ ఎంవిఎస్ జూనియర్ కళాశాలకు రూ 17 లక్షలు, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు రూ 21 లక్షల 50 వేలు, ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు రు 12 లక్షల 55 వేల నిధులతో కేటాయించిన ప్రభుత్వ కళాశాలలో పూర్తిస్థాయిలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.