12-06-2025 01:54:12 AM
- వినిపించిన వాదనలే మళ్లీ మళ్లీ వినిపించొద్దు..
- విచారణ ఆలస్యమైతే అభ్యర్థులు ఇబ్బంది పడుతారు: హైకోర్టు
- స్టే ఎత్తివేయాలని దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ
హైదరాబాద్, జూన్ 11: గ్రూప్ బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గా ల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను ఆలస్యం చేయవద్దని, దీనివల్ల ఎంపికైన అభ్యర్థులు ఇబ్బందులు పడు తారని తెలిపింది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా కేం ద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకో ర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈ పిటిషిన్లపై వాదనలు జరిగాయి. పునర్మూల్యాంకనం చేయాలని లేదా మరోసారి మెయిన్స్ నిర్వహించాలని పిటిషినర్ల తరఫు న్యాయవాదులు కోరారు. అభ్యర్థులు అపోహ పడుతున్నారని, నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
గ్రూప్ 1 నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని ఆదేశించింది. అయితే గ్రూప్ 1 నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఎంపికైన అభ్యర్థులు న్యాయస్థానంలో వేర్వేరుగా నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు.
బుధవారం స్టే వెకెట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలు చేయడానికి టీజీపీఎస్సీ, ఇతర న్యాయవాదులు సమయం కోరారు. విచారణను ఆలస్యం చేయవద్దని, దీనివల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని కోర్టు పేర్కొంది. వినిపించిన వాదనలే మళ్లీ మళ్లీ వినిపించొద్దని, ఈనెల 30న పూర్తిస్థాయి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.