31-05-2025 12:00:00 AM
బాధిత కుటుంబీకులు
ఖైరతాబాద్, మే 30 (విజయక్రాంతి) : గడిచిన 18న జరిగిన పాత బస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కు టుంబీకులు సంతోష్ గుప్తా, నితీష్, అతుల్ అగర్వాల్, స్థానికుడు శ్రీనివాసలతో కలిసి మాట్లాడారు..
అగ్ని ప్రమాదం జరగగానే ఉదయం ఆరు 12 నిమిషాలకు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా 6:45కు ఘటన స్థలానికి చేరుకున్నారని అన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అనంతరం కూడా ఫైర్ ఇంజన్ లో సగం వరకే వాటర్ ఉండడం, అంబులెన్స్లో ఆక్సిజన్ లేకపోవడం, కారణంగా స హాయక చర్యలు ముమ్మరం కాలేదని ఆరోపించారు. తదనంతరం శత గాత్రులను ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లి తాము ఎంత ప్రాధేయపడిన అక్కడి వైద్యులు పోలీ స్ ఎఫ్ఐఆర్ లేనిదే ట్రీట్మెంట్ చేయమని చేతులెత్తేసారని వాపోయారు.
దీంతో తా ము వారిని హుటాహుటిన మలక్పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి ఆసుప త్రికి తరలించగా వారు అప్పటికే చనిపోయారని డాక్టర్లు నిర్ధారణ చేసినట్లు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది, వైద్య సిబ్బంది సరైన సమయంలో స్పందించి ఉంటే తమ కుటుం బ సభ్యులు బ్రతికుండేవారని ఆవేదన వ్య క్తం చేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన కమిటీ కూడా ఇప్పటివరకు తమను సంప్రదించలేదన్నారు. దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో గాని రిటైర్డ్ జడ్జితో గాని న్యాయ విచారణ జరిపించి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.