10-07-2025 04:17:43 PM
హాలియా,(విజయక్రాంతి): హాలియా సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు మనోజ్ పాండే ఆధ్వర్యంలో మురళి అయ్యగారు రమణ శర్మ భీష్మాచార్యులు వెంకటాచార్యులు వినోద్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ కంకణ ధర్నా 108 కలిశాలతో బాబాకు అభిషేకం అనంతరం స్వామివారిని పూలమాల మాలతో ప్రత్యేకంగాలకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం మహాను ప్రసాద్ వితరణ సాయంత్రం ఆలియా పురవీధుల్లో మహిళా కోలాటంతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయిబాబా గుడి చైర్మన్ తేలపోలు శేఖర్ సక్రు నాయకు శివకుమార్ ఏర్పాటు చేశారు.