calender_icon.png 13 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.163 కోట్లు ఇవ్వండి

13-11-2025 12:07:15 AM

  1. గురుకులాల, మధ్యాహ్న భోజన బకాయిలు విడుదల చేయాలి
  2. ఆర్థిక శాఖకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజనానికి సం బంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రజా భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లా డారు.

రాష్ర్టంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధిం చిన డైట్, అద్దె, కాస్మోటిక్స్ బకాయిలకు సంబంధించిన రూ. 51.36 కోట్లు చెల్లించాలని కోరారు. వీటితోపాటు రాష్ర్టంలోని అన్ని మైనారిటీ గురుకులాలు మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకా యిలు రూ. 47.61 కోట్లు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 63.92 కోట్ల బకాయిలు ఇవ్వాలని ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో, వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ప్రజా ప్రభు త్వం అధికారంలోకి రాగానే గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్వహకులు నాణ్యత లో ఎక్కడా రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని సూచించారు.