calender_icon.png 2 June, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ పాలనలో పాతాలానికి గురుకులాలు

01-06-2025 01:14:43 AM

- గురుకాలల అధికారి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలి

- బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): విద్యార్థులు వాళ్ల టాయిలెట్లు వాళ్లు కడుక్కుటే తప్పేంటని మాట్లాడిన గురుకులాల ప్రత్యేక అధికారి అలుగు వర్షిణిపై చర్యలు తీసుకోవాలని, ఆమెను సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీ సంక్షేమ గురుకులాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. పేదపిల్లలు టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో సీఎం ఎలా చెప్పిస్తారని ఆయన మండిపడ్డారు. ఎవరి టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని రాష్ర్టవ్యాప్తంగా జీవో ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఎస్సీ గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధో పాతాళానికి వెళ్లాయని మండిపడ్డారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో సీఎం స్కామ్ చేస్తున్నారని, నిర్మాణ పనులు తన అనుచరులకే దక్కేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గౌలిదొడ్డిలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను బయటకు పంపాలని ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని, గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు మూతపడే విధంగా సీఎం వ్యవహారిస్తున్నారన్నారు. అందాల పోటీలకు వచ్చిన వారికి 30 తులాల బంగారం ఇవ్వటానికి మీకు బడ్జెట్ వస్తుందిగానీ, పేద పిల్లల చదువులకు మీ వద్ద బడ్జెట్ లేదా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.