01-06-2025 01:13:19 AM
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం నిర్మించబోయే గోశాలల విషయంలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఒక్కో గోశాలను 50 ఎకరాలకు తగ్గకుండా ఆధునిక సౌకర్యాల తో నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రో ల్ సెంటర్లో శనివారం ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గోశాలల నిర్మాణ పనుల పర్యవేక్ష ణకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోపు ఆ కమిటీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదటిదశలో రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ వర్సిటీలు, కళాశాలలు, అగ్రికల్చర్ వర్సిటీ లు, కళాశాలలతో పాటు ఆలయాలకు సం బంధించిన భూముల్లో గోశాలలు ఏర్పా టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇరుకు స్థలాలను ఎంపి క చేయవద్దని, విశాలమైన ప్రదేశాలను మాత్రమే గోశాలలకు ఎంపిక చేయాలని సూచించారు. గోశాలల్లో అత్యాధునిక వసతులు ఉండాలని, గోవులకు మేత కొర త రాకుండా చూడాలన్నారు. గోశాలల్లో గోవులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండాలని పేర్కొన్నారు. వాటి నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
అనంతరం సీఎం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గోశాల నిర్మాణానికి రూపొందించిన అనేక డిజైన్లను పరిశీలించారు. డిజైన్ల పై సీఎం సలహాలు, సూచనలిచ్చారు. సమావేశంలో సీఎంవో అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్రాజ్, అజిత్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెఎంఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.