13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్పంచ్ నరేష్ నాయక్

07-01-2026 07:35 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు ముందుకు వేసినట్లు గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ తెలిపారు. జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండాలోని హనుమాన్ తండా వెళ్లే దారి బురదమయం కావడంతో సర్పంచ్ నరేష్ నాయక్ తన సొంత నిధులతో సుమారు 60 ట్రాక్టర్ల మట్టిని  జేసీబీ సహాయంతో పోయించడం జరిగిందని తెలిపారు.

దీనివల్ల తండా ప్రజలకు రాకపోకలు సులభమవడంతో పాటు, గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తామని సర్పంచ్ నరేష్ నాయక్ అన్నారు.గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ప్రజలందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.