18 July, 2026 | 7:18 PM

Breaking News

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి   •   నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •  

అధిక వర్షానికి అపార నష్టం పూర్తిగా నేలమట్టం మైన మొక్కజొన్న పంట

25-09-2025 12:45 AM

ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 24, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని ఆళ్లపల్లి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకి వెళితే మైలారం గ్రామానికి చెందిన జోగా నాగేశ్వరరావు అనే రైతు సుమారు 6 ఎకరాల కోత దశకు వచ్చిన మొక్కజొన్న పంట అధిక వర్షాలకు పూర్తిగా నేలకొరిగింది.

పంట సాగుకు అప్పో సపోజ్ చేసి ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే అధిక వర్షాలు తీరని నష్టాన్ని కలిగించిందని వాపోతున్నాడు.రైతు ఈ మొక్కజొన్న సాగు కోసం సుమారు రూ 1.50లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేయగా, ఉన్న ఆరెకరాలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ప్రభుత్వ అధికారులు దెబ్బతిన్న మొక్కజొన్న చేనుకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.