18 July, 2026 | 6:48 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

ఇండ్ల మధ్యలోని మురుగునీరును తొలగించండి

25-09-2025 12:44 AM

మాగనూరు .సెప్టెంబర్, 24.మాగ నూరు మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామంలో ఇం డ్ల మధ్య వర్షం నీరు , మురుగునీరు ఆగడం వల్ల కాలనీలోని ఇండ్లకు వెళ్లే రహదారులు నీటితో నిండడం వల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడుతుందని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల గ్రామంలోని అంతర్గత రహదారుల పైనుంచి నీరు రావడం జరుగుతుందన్నారు.

చిన్నపాటి వర్షం వచ్చిన ఇండ్ల మధ్యలోనే నీరు నిలువ ఉండి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో నీరు నిల్వ ఉండడం వల్ల విషసర్పాలు,ఈగలు ,దోమలు, ఎక్కువ అవుతున్నాయి, ఈగలు దోమల వల్ల రోగాల బారిన పడవలు చూస్తుందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంపై అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి ఇండ్ల మధ్యలో నిలిచిన మురుగునీటిని తొలగించి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను గ్రామస్తులుకోరుతున్నారు.